నవపక్షం, కురవి ప్రతినిధి, ఆగస్టు 09: కురవి మండలం రాజోలు గ్రామంలో నిర్వహించిన ముత్యాలమ్మ బోనాల వేడుకల్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
అనంతరం గ్రామ ప్రజలు, భక్తులతో కలిసి బోనాల వేడుకల్లో పాల్గొని వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






