నవపక్షం, హైదరాబాద్, ఆగస్టు 09: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం (ఆగస్టు 10) నర్సంపేటలో పర్యటించనున్నారు.
ఉదయం 10 గంటలకు నార్సింగిలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసం నుంచి కేటీఆర్ నర్సంపేటకు బయలుదేరుతారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంతాప సభ కార్యక్రమానికి హాజరవుతారు.
మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొని, పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేయనున్నారు.
ఈ కార్యక్రమం పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లిలో నిర్వహించనున్నారు.






