నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభ నల్లబెల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను, ప్రజా జీవితంలో చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలు, ప్రజా సేవా స్ఫూర్తి చిరస్మరణీయమని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొని స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించారు.






