మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా 4.21 లక్షల మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా

నవపక్షం, హైదరాబాద్ బ్యూరో: రాష్ట్రంలోని నమోదిత మత్స్యకారుల సామాజిక భద్రతకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం (GAIS) అమలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రత, సామాజిక రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ పథకం కింద 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల నమోదిత మత్స్యకారులు అర్హులని మంత్రి వెల్లడించారు. ఒక్కో లబ్ధిదారునికి బీమా ప్రీమియం రూ.79.96 కాగా, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ప్రీమియాన్ని భరిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21.34 కోట్లకు పైగా చెల్లించనుండటంతో లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు.

బీమా పథకం ప్రయోజనాలు

  • ప్రమాదవశాత్తు మరణం: రూ.5 లక్షలు
  • శాశ్వత సంపూర్ణ వైకల్యం: రూ.5 లక్షలు
  • శాశ్వత పాక్షిక వైకల్యం: రూ.2.50 లక్షలు
  • ప్రమాదవశాత్తు ఆసుపత్రి చికిత్స: గరిష్ఠంగా రూ.25 వేల వరకు

ఈ పాలసీ 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి నమోదిత మత్స్యకారుడికి నిరంతర బీమా రక్షణ అందేలా మత్స్యశాఖ అవసరమైన చర్యలు చేపడుతోందని వెల్లడించారు.

ప్రమాద సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలవడం, వారి భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులకు సమగ్ర సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

Hot this week

టీటీడీ జేఈవోగా శ్రీ ప్రభల గోపీనాథ్ బాధ్యతలు స్వీకరణ

తిరుమల, ఆగస్టు 10 (నవపక్షం): టీటీడీ నూతన జేఈవో (వైద్యం, విద్య)గా...

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం 36 ఏళ్ల తర్వాత కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న 1989–90 బ్యాచ్ విద్యార్థులు

నవపక్షం, దమ్మపేట ప్రతినిధి: దమ్మపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 1989–90 సంవత్సరాల్లో...

శ్రీ వాత్సల్య పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

వరంగల్ ఆరేపల్లి, ఆగస్టు 10 (నవపక్షం జిల్లా ప్రతినిధి – బండారి...

విశ్రాంత ఉద్యోగి ఉప్పల మల్లయ్యకు మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి నివాళులు

నవపక్షం, తిరుమలగిరి ప్రతినిధి: తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన ప్రముఖ...

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభకు కేటీఆర్, హరీష్ రావు హాజరు

నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది...

Topics

టీటీడీ జేఈవోగా శ్రీ ప్రభల గోపీనాథ్ బాధ్యతలు స్వీకరణ

తిరుమల, ఆగస్టు 10 (నవపక్షం): టీటీడీ నూతన జేఈవో (వైద్యం, విద్య)గా...

శ్రీ వాత్సల్య పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

వరంగల్ ఆరేపల్లి, ఆగస్టు 10 (నవపక్షం జిల్లా ప్రతినిధి – బండారి...

విశ్రాంత ఉద్యోగి ఉప్పల మల్లయ్యకు మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి నివాళులు

నవపక్షం, తిరుమలగిరి ప్రతినిధి: తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన ప్రముఖ...

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభకు కేటీఆర్, హరీష్ రావు హాజరు

నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది...

ఇంటింటికీ కళ్లద్దాల పంపిణీ చేసిన 20వ వార్డు కౌన్సిలర్ ఎం.డి. హన్ను బాయ్

నవపక్షం, మునుగోడు ప్రతినిధి : శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల...

నకిరేకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డీసీఎంను ఢీకొన్న బుల్లెట్.. ఘటనాస్థలంలోనే మృతి

నవపక్షం, నల్గొండ జిల్లా ప్రతినిధి : నకిరేకల్ పట్టణంలోని పద్మానగర్ బైపాస్...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img
App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.