నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ శాలిగౌరారం ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు పోషకాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ దాతలు చామల లతారెడ్డి – రామచంద్రారెడ్డి దంపతుల సహకారంతో గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు నిమ్మల ఆంజనేయులు మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. సమాజంలో అవసరమైన వారికి సేవ చేయడమే లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
కార్యక్రమంలో చార్టెడ్ ప్రెసిడెంట్ బుడిగ శ్రీనివాసులు, జోన్ చైర్మన్ డెంకల సత్యనారాయణ, రెండవ ఉపాధ్యక్షులు వడ్లకొండ బిక్షం, దొనక ఎంకన్న, వైద్యాధికారి డాక్టర్ స్వప్న, సూపర్వైజర్ మరియమ్మ, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. గర్భిణీల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ పోషకాహారం అందించిన లయన్స్ క్లబ్ సభ్యులు, దాతలను పలువురు అభినందించారు.






