నవపక్షం, హైదరాబాద్: బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను నందినగర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం తొలిసారిగా కేటీఆర్ను సైదులు యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ, విద్యార్థి సమస్యలపై చర్చించినట్లు తెలిపారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారం, బీసీ విద్యార్థుల హక్కులు, విద్యా రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్లో మరింత చురుగ్గా పనిచేయాలని ఈ సందర్భంగా చర్చించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, బీఆర్ఎస్వీ నాయకుడు పరుశురాం తదితరులు పాల్గొన్నారు.






