ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నాగేందర్ గౌడ్? పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీకి సన్నాహాలు.. బీఆర్‌ఎస్ టికెట్‌పై ఆశలు సుదీర్ఘ రాజకీయ అనుభవం, బీసీ సామాజిక సమీకరణాలపై ధీమా

నవపక్షం, తెలంగాణ బ్యూరో : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఇప్పటి నుంచే సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతుండగా, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు నాగేందర్ గౌడ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది.

బీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగేందుకు సన్నాహాలు

తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తూ, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న నాగేందర్ గౌడ్.. వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2001 నుంచి టీఆర్‌ఎస్‌తో కొనసాగుతున్న ఆయనకు పార్టీ వ్యవహారాలు, ఉద్యమ నేపథ్యం, క్షేత్రస్థాయి రాజకీయాలపై మంచి అనుభవం ఉందని అనుచరులు పేర్కొంటున్నారు.

గతంలో పలు సందర్భాల్లో పార్టీ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ అనుకూల ఫలితం దక్కలేదు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో టికెట్ ఆశించిన ఆయనకు పార్టీ అధిష్ఠానం నుంచి అవకాశం లభించకపోవడంతో నిరాశ చెందారు. అయితే పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తూ, తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు కొనసాగించారు.

బీసీ సమీకరణాలపై ఆశలు

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో నాగేందర్ గౌడ్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ఆసక్తి నెలకొంది. బీసీ వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే అభ్యర్థిగా తనకు అవకాశం కల్పిస్తే పట్టభద్రుల నియోజకవర్గంలో పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని ఆయన వర్గం భావిస్తోంది.

సుదీర్ఘకాలంగా పార్టీతో కొనసాగిన అనుభవం, క్షేత్రస్థాయిలో ఉన్న పరిచయాలు, బీసీ సామాజిక వర్గంలో ఉన్న మద్దతు తనకు అనుకూలంగా మారుతాయని నాగేందర్ గౌడ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

కీలకంగా మారనున్న పట్టభద్రుల నియోజకవర్గం

రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. వచ్చే మార్చిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పలువురు నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో రాబోయే రోజుల్లో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీల్లో చర్చలు మరింత వేడెక్కే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో నాగేందర్ గౌడ్‌కు బీఆర్‌ఎస్ అధిష్ఠానం నుంచి అవకాశం లభిస్తుందా? ఆయనను పార్టీ అధికారిక అభ్యర్థిగా ప్రకటిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ అధిష్ఠానం నిర్ణయంపైనే ఆయన రాజకీయ భవిష్యత్‌లో మరో కీలక అడుగు ఆధారపడి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Hot this week

నకిరేకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డీసీఎంను ఢీకొన్న బుల్లెట్.. ఘటనాస్థలంలోనే మృతి

నవపక్షం, నల్గొండ జిల్లా ప్రతినిధి : నకిరేకల్ పట్టణంలోని పద్మానగర్ బైపాస్...

నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకు కేటీఆర్ హాజరు

నవపక్షం, హైదరాబాద్, ఆగస్టు 09: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

గురజాలలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం 120 మందికి కంటి పరీక్షలు.. 15 మందికి ఉచిత ఆపరేషన్లు

నవపక్షం, ఆగస్టు 9, శాలిగౌరారం: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత కంటి...

Topics

నకిరేకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డీసీఎంను ఢీకొన్న బుల్లెట్.. ఘటనాస్థలంలోనే మృతి

నవపక్షం, నల్గొండ జిల్లా ప్రతినిధి : నకిరేకల్ పట్టణంలోని పద్మానగర్ బైపాస్...

నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకు కేటీఆర్ హాజరు

నవపక్షం, హైదరాబాద్, ఆగస్టు 09: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img
App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.